
- బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు కార్పొరేటర్లు రెడీ
- ఇటీవల కూర్చుని మాట్లాడుకున్న నేతలు
- పార్టీ మారే అంశంపై కాంగ్రెస్నేతలతోనూ చర్చలు
- త్వరలో చేరనున్నట్లు సమాచారం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు జెండా మారుస్తున్నారు. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా చాలా మంది కాంగ్రెస్లో చేరగా, మరికొందరు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుండడంతో ఆ పార్టీలో ఉంటే ప్రయోజనం లేదని, కనీసం తమ డివిజన్లనైనా డెవలప్ చేసుకునేందుకు అధికార కాంగ్రెస్లో చేరనున్నట్లు వారి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. మరోవైపు గ్రేటర్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్అధిష్ఠానం ప్లాన్ చేస్తుంది. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే విధంగా ఇప్పట్నుంచే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది.
త్వరలో 12 మంది చేరిక
నాలుగు రోజుల క్రితం బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన15 మంది కార్పొరేటర్లు ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్కు చెందిన పలువురు
కార్పొరేటర్లను ఆహ్వానించి చేరికకు సంబంధించి చర్చించినట్లు తెలిసింది. ఇందులో దాదాపు 12 మంది కార్పొరేటర్లు పార్టీలు మారుతారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎక్కువ శాతం బీఆర్ఎస్ నుంచి, బీజేపీకి చెందిన ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే 19కి చేరిన కాంగ్రెస్ సంఖ్య
2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 56 మంది, బీజేపీ నుంచి 48, ఎంఐఎం నుంచి 44, కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లుగా గెలుపొందారు. ప్రమాణ స్వీకారానికి ముందే ఇందులో బీజేపీ నుంచి గెలుపొందిన లింగోజీగూడ కార్పొరేటర్ మరణించాడు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆపై ఎంఐఎం కార్పొరేటర్లు మినహా మిగతా వారు అటు ఇటు పార్టీలు మారుతూ వచ్చారు. ఎంఐఎం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, ఎర్రగడ్డ కార్పొరేటర్ మరణించారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్కు 47 మంది, ఎంఐఎంకు 41, బీజేపీకి మంది, కాంగ్రెస్కు 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు.