నీ హోటల్ మూయొద్దంటే ఐదు లక్షలియ్యి!

నీ హోటల్ మూయొద్దంటే ఐదు లక్షలియ్యి!
  • జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్​ డిమాండ్​
  • రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

గండిపేట,వెలుగు: ‘నీ హోటల్​ రూల్స్​కు విరుద్ధంగా ఉంది.. సరైన వసతులు లేవు.. నేను అటు వైపు చూడొద్దు, హోటల్​ మూయొద్దు అంటే ఐదు లక్షలియ్యాలి’ అంటూ మునిసిపల్​ అధికారి ఓ హోటల్​ యజమానిని హెచ్చరించాడు. అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. సదరు వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా వారు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 

రాజేంద్రనగర్ జీహెచ్​ఎంసీ సర్కిల్ పరిధిలో ఓ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, సీజ్​ చేయొద్దంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ డిమాండ్​ చేశారు. చివరకు రూ.2 లక్షలు తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. బాధితుడు ఏసీబీకి విషయం చెప్పాడు. శుక్రవారం జీహెచ్ఎంసీ ఆఫీసులోని తన చాంబర్​లో రూ.2 లక్షలు తీసుకుంటుండగా రవికుమార్​ను ఏసీబీ డీఎస్​పీ శ్రీనివాస్​రెడ్డి బృందం రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.