రసాభాసగా జీహెచ్​ఎంసీ సమావేశం.. బాయ్​కాట్​ చేసిన అధికారులు

రసాభాసగా జీహెచ్​ఎంసీ సమావేశం.. బాయ్​కాట్​ చేసిన అధికారులు

జీహెచ్​ఎంసీ సమావేశం రసాభసాగా జరుగుతోంది.  ఈ సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది.  జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు.  విపక్ష కౌన్సిలర్ల తీరుకు నిరసనగా అధికారులు బయటకు వెళ్లారని తెలుస్తోంది.  అయితే చరిత్రలో మొదటి సారిగా జీహెచ్ఎంసీ జోనల్​ కమిషనర్లు, వాటర్​ బోర్డ్​ అధికారులు బాయ్​ కాట్​ చేశారు.  

విపక్ష కౌన్సిలర్లు లైఫ్​ జాకెట్​ ధరించి నిరసన తెలిపారు. చుక్క చినుకు పడితే నగరమంతా అల్లకల్లోలమవుతుందని తెలిపారు. ప్రజల సమస్యలపై పరిష్కరిస్తామని మేయర్​ విజయలక్ష్మి  తెలిపారు. గత సమావేశాలను విపక్ష కార్పొరేటర్లు బహిష్కరించారని తెలిపారు. వారు ఇలా చేయడం చాలా బాధాకరమని విజయలక్ష్మి పేర్కొన్నారు.  

ఇటీవల జలమండలి కార్యాలయాన్ని బీజేపీ కార్పొరేటర్లు ముట్టడించారు. సమావేశం సక్రమంగా జరగకుండా బీజేపీ ఎమ్మెల్సీలు ఆటంకం కలిగిస్తున్నారన్నారు.  దీంతో మేయర్​ విజయలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేశారు. సభ్యుల విఙ్ఞప్తి మేరకే సభను ఆలస్యంగా ప్రారంభించామన్నారు. 

బాధాకరమైన రోజు

మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ఇవాళ ( మే3) చాలా బాధాకరమైన రోజన్నారు. ఐదు నెలల తరువాత ప్రజల సమస్యలు పరిష్కారం కోసం..అన్నీ పార్టీల నేతలతో చర్చించిన తరువాతే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు  సంస్కారం లేకుండా మాట్లాడారని మేయర్​ వాపోయారు.  సభ సజావుగా జరగకుండా ఉండాలని బ్లాక్​ షర్ట్స్​ ధరించి నిరసనకు దిగారన్నారు.