
- విజయనగర్కాలనీలో ఘటన
- ఎమ్మెల్యే వార్నింగే కారణమా?
మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నం సర్కిల్ 12 పరిధిలోని విజయనగర్ కాలనీలో ఓ బీఆర్ఎస్లీడర్అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి వచ్చిన బల్దియా టౌన్ప్లానింగ్అధికారులు యాక్షన్తీసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. స్థానిక బీఆర్స్నేత ఒకరు ఇక్కడ జీ ప్లస్ టుకు అనుమతులు తీసుకొని జీ ప్లస్ సిక్స్బిల్డింగ్నిర్మించారు. దీనిపై కొందరు బల్దియా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో బిల్డింగ్ఓనర్కు ఇది వరకే రెండు సార్లు నోటీసులు ఇచ్చారు.
అయినా, బిల్డింగ్యజమాని స్పందించలేదు. దీంతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గురువారం విజిలెన్స్ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి భవనాన్ని సీజ్ చేయడానికి వచ్చారు. వీరిని భవన యజమాని అడ్డుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్కు ఫోన్ చేయడంతో ఆయన వచ్చి బల్దియా అధికారులతో మాట్లాడారు.
ఆయన వార్నింగ్ఇవ్వడంతోనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు చర్చించుకున్నారు. కూల్చడానికి వచ్చిన అధికారులు సైలెంట్గా వెళ్లిపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.