బీఆర్ఎస్ లీడర్ అక్రమ నిర్మాణం... కూల్చడానికి వచ్చి కూల్గా వెళ్లిపోయారు!

బీఆర్ఎస్ లీడర్ అక్రమ నిర్మాణం... కూల్చడానికి వచ్చి కూల్గా వెళ్లిపోయారు!
  • విజయనగర్​కాలనీలో ఘటన 
  • ఎమ్మెల్యే వార్నింగే కారణమా? 

మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నం సర్కిల్ 12 పరిధిలోని విజయనగర్ కాలనీలో ఓ బీఆర్ఎస్​లీడర్​అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి వచ్చిన బల్దియా టౌన్​ప్లానింగ్​అధికారులు యాక్షన్​తీసుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. స్థానిక బీఆర్​స్​నేత ఒకరు ఇక్కడ జీ ప్లస్ టుకు అనుమతులు తీసుకొని జీ ప్లస్ సిక్స్​బిల్డింగ్​నిర్మించారు. దీనిపై కొందరు బల్దియా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో  బిల్డింగ్​ఓనర్​కు ఇది వరకే రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. 

అయినా, బిల్డింగ్​యజమాని స్పందించలేదు. దీంతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గురువారం విజిలెన్స్ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి భవనాన్ని సీజ్ చేయడానికి వచ్చారు. వీరిని  భవన యజమాని అడ్డుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్​కు ఫోన్ చేయడంతో ఆయన వచ్చి బల్దియా అధికారులతో మాట్లాడారు. 

ఆయన వార్నింగ్​ఇవ్వడంతోనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు చర్చించుకున్నారు. కూల్చడానికి వచ్చిన అధికారులు సైలెంట్​గా  వెళ్లిపోవడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.