- ట్యాంకర్ల సరఫరాపై వాటర్బోర్డు ఎండీ
హైదరాబాద్సిటీ, వెలుగు: ఎండాకాలం వేళ సిటీలో తాగునీటి సరఫరా పరిస్థితులపై వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏ ప్రాంతంలోనైనా సప్లై చేయడానికి తగినంత నీళ్లు లేకపోతే సర్దుబాటు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ఎక్కువ నీళ్లందుతున్న ప్రాంతాల నుంచి తక్కువగా అందుతున్న ప్రాంతాలకు మళ్లించి సర్దుబాటు చేయాలన్నారు. పగలు గృహ అవసరాలకు, రాత్రి కమర్షియల్ అవసరాలకు ట్యాంకర్లను డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
