దేశం తల నరికేశారు: ఆజాద్

దేశం తల నరికేశారు: ఆజాద్

జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిగించే అర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ ఖండించారు. ఇది కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాయడమే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ ఖూనీ చేసిందని, దేశం తల నరికేసిందని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ ను భారత్ లో ఉంచడానికి ఎంతో మంది పౌరులు, సైన్యం ప్రాణాలు అర్పించారన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంనేందుకు ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమన్నారు. అయితే  ఆజాద్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. ఓటు బ్యాంకు రాజకీయం కోసం బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు షా. ఇన్నాళ్లు జమ్మూకశ్మీర్ ను మూడు కుటుంబాలు దోచుకున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.