గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం .. పోటీ నుంచి డ్రాప్

 గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం .. పోటీ నుంచి డ్రాప్

డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఎపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన డీపీఎపీ ఒక ప్రకటనలో వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి ఆయన తన నామినేషన్  ఉపసంహరించుకున్నారని తెలిపింది.  

ఆజాద్ స్థానంలో మహ్మద్ సలీమ్ పరాయ్ పేరును పార్టీ ప్రకటించింది. గులాం నబీ  ఆజాద్ 2022లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, ఆ పార్టీతో తన ఐదు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి పలికి,  డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. ఈ ఎన్ని్కల్లో ఆయన  అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2న ఆయన  నామినేషన్ కూడా వేశారు. ఆ తరువాత కొద్దీ రోజులుకే ఆయన యూటర్న్ తీసుకుని నామినేషన్ ను ఉపసంహరించుకున్నార.  

ఇక 2014లో ఉధంపూర్‌ నుంచి బీజేపీ చేతిలో ఓడిన తర్వాత ఆజాద్‌కు ఇవే తొలి లోక్‌సభ ఎన్నికలు. 1980, 1984లో మహారాష్ట్రలోని వాషిమ్‌ నుంచి ఆజాద్‌ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-2006 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 2006-08 మధ్య జమ్ముకశ్మీర్‌ సీఎంగా కొనసాగారు. 2009-2021 ఫిబ్రవరి వరకు మళ్లీ పెద్దల సభలోనే కొనసాగారు.