ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. జనవరి 15వ తేదీ సోమవారం ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు పంపించారు. గిడుగు రాజీనామా చేయడంతో..  షర్మిలకు లైన్ క్లియర్ అయనట్లు వార్తలు వస్తున్నాయి.

 రెండు, మూడు రోజుల్లో వైఎస్ షర్మిల.. ఎపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  ఆదివారం రాహుల్ గాంధీ.. మణిపూర్ లో ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో కూడా  వైఎస్ షర్మిల పాల్గొన్నారు.