వేములపల్లి, వెలుగు: తనకు పెళ్లి వద్దంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించిన సంఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుం ది. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఓ బాలికకు చిట్యాలకు చెందిన ఓ వ్యక్తితో వివాహ నిశ్ఛితార్ధం నిర్ణయించారు. దీంతో తాను మైనర్ ను అని.. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అంగన్ వాడీ సూపర్ వైజర్ రాజరాజేశ్వరికి సమాచారం అందజేశారు. ఆమె స్టేషన్ కు చేరుకొని బాలిక వివరాలు సేకరించారు. బాలిక తండ్రితో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటా మని ఆమె తెలిపారు.