లైంగిక వేధింపులు: విద్యార్థిని కాల్చి చంపిన టీచర్

లైంగిక వేధింపులు: విద్యార్థిని కాల్చి చంపిన టీచర్

తన కోరిక తీర్చలేదని… పాఠాలు చెప్పే టీచరే… ఓ విద్యార్ధిని కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయిని శైలేంద్ర సింగ్(25) అనే టీచర్ చాలా రోజులనుంచి లైంగికంగా వేదిస్తున్నాడు. దీంతో అతనిపై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో స్కూల్ ప్రిన్సిపల్…. శైలేందర్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. అవమానాన్ని భరించని శైలేందర్.. ఆ అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా… దారి మధ్యలో ఆపి…  గన్ తో మూడు సార్లు కాల్చాడు. ఒక బులెట్ అమ్మాయి మెడ నుంచి దూసుకుపోయింది.  దీంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాన్పూర్ ఎస్పీ అనురాగ్ వాట్స్ మాట్లాడుతూ.. శైలేందర్ పై మర్డర్ కేసు నమోదు చేశామని తెలిపారు.