ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి సూసైడ్

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి సూసైడ్

వేధింపులకు ఓ యువతి బలైంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు రోజూ వెంటపడటంతో..భరించలేని ఆ యువతి మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో శుక్రవారం జరిగింది. పోల్కంపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి రుక్మిణి(20)ని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను ప్రేమించాలని అమ్మాయికి టార్చర్ పెడుతున్నాడు. వేధింపులు భరించలేని యువతి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

కొన్ని రోజులుగా ఓ యువకుడు వేధిస్తున్నాడని.. తమ కూతురు ఇటీవలే చెప్పిందని తెలిపారు రుక్మిణి తల్లిదండ్రులు. అయితే అతడు ఎవరన్నది తమకు చెప్పలేదన్నారు. కుమార్తె మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రుక్మిణి తల్లిదండ్రులు..తమ బిడ్డ చావుకు కారణమైన ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడు ఎవరనేదానిపై వివరాలు సేకరిస్తున్నామన్నారు.