- వేరే పెళ్లికి ఒప్పుకుందని చెన్నైలో ఘటన
- నిప్పంటించిన యువకుడితో పాటు తల్లీకూతుళ్లు మృతి
చెన్నైలో దారుణం జరిగింది. తనను ప్రేమించి వేరోకరితో పెళ్లికి ఒప్పుకుందని ప్రియురాలితో పాటు ఆమె తల్లికి కూడా నిప్పటించి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రేమికుడు. కొరుక్కుపేటలోని అనంతనాయకి వీధిలో వెంకటేష్, వెంకటమ్మల్ (46) అనే దంపతులు తమ తన కూతురు రజిత (26)తో కలిసి ఉండేవాళ్లు. వెంకటేష్, రజితలు స్థానిక కార్పొరేషన్లో ఉద్యోగం చేసేవారు. నాలుగు సంవత్సరాల క్రితం వారు తమ ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటినుంచి వెంకటమ్మల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తుంది.
కాగా.. రజిత గత ఏడు సంవత్సరాల నుంచి రాయపురం జోన్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమకు రజిత తల్లి వెంకటమ్మల్ ఒప్పుకోలేదు. అంతేకాకుండా రజితకు గత నెలలో వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసింది. దాంతో కోపం పెంచుకున్న యువకుడు.. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు రజిత ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న రజిత, ఆమె తల్లి వెంకటమ్మల్ మీద కిరోసిన్ పోసి.. తాను కూడా పోసుకొని నిప్పటించాడు. ఈ ఘటనలో ముగ్గురూ చనిపోయారు. స్థానికుల ఫిర్యాదు మేరకు.. ఆర్కె నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
For More News..