
ఆదిలాబాద్ జిల్లా, దహెగాం,వెలుగు: ప్రియుడు పెళ్లికి నో చెప్పడంతో ఓ యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. దహెగాంకు చెందిన సింగ్రూపు అశ్విని(23) అదే గ్రామానికి చెందిన బాసిక తిరుపతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మూడేళ్లుగా తిరుపతి నమ్మించాడు. ఇటీవల మాటమార్చడంతో ఆదివారం పురుగల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కాగజ్ నగర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతురాలి తండ్రి సింగ్రూపు మధూకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.