మహిళపై లాఠీచార్జ్ ఘటనలో 2 రోజుల్లో రిపోర్టు ఇవ్వండి : తమిళిసై

మహిళపై లాఠీచార్జ్  ఘటనలో 2 రోజుల్లో రిపోర్టు ఇవ్వండి :  తమిళిసై

హైదరాబాద్, వెలుగు : ఎల్బీ నగర్  పీఎస్ లో ఎస్టీ మహిళపై పోలీసులు లాఠీచార్జ్  చేసిన ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, రాచకొండ సీపీని గవర్నర్  తమిళిసై ఆదేశించారు. ఎస్టీ మహిళపై పోలీసులు చేసిన దాడిని మీడియాలో చూసి తెలుసుకున్నానని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని గవర్నర్  శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధిత మహిళ ఇంటికెళ్లి పరామర్శించి ఆమెను ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా రెడ్ క్రాస్  యూనిట్ బ్రాంచ్  నిర్వాహకులను గవర్నర్  ఆదేశించారు.