షారుఖ్ ఖాన్ దేశద్రోహి.. అతని నాలుక కట్ చేసినవారికి రూ.లక్ష రివార్డు

షారుఖ్ ఖాన్ దేశద్రోహి.. అతని నాలుక కట్ చేసినవారికి రూ.లక్ష రివార్డు

కోల్‌కతా నైట్ రైడర్స్ కో ఓనర్ షారుఖ్ ఖాన్ ఊహించని ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ లో కేకేఆర్ జట్టులో ఉండడమే ఇందుకు కారణం. బంగ్లాదేశ్ లో మైనారిటీలు హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని మతోన్మాద దాడులుకు పాల్పడుతున్నారు. ముస్తాఫిజుర్ రెహమాన్ కోల్‌కతా జట్టులో ఉండడం చాలా రాజకీయ పార్టీలకు నచ్చలేదు. బంగ్లా ఫాస్ట్ బౌలర్ ను ఐపీఎల్ మినీ వేలంలో కొనుగోలు చేసినందుకు షారుఖ్ ను జట్టు నుండి తొలగించాలని హెచ్చరిస్తున్నారు. తాజాగా హిందూ మహాసభ నాయకురాలు మీరా రాథోడ్.. షారుఖ్ నాలుక కోసే వారికి లక్ష రూపాయల బహుమతి లభిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మీరా రాథోడ్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కొనుగోలు చేసిన షారూఖ్ ఖాన్‌ దేశద్రోహి. ఒకవైపు బంగ్లాదేశ్‌లో హిందువులను చంపుతుంటే మరోవైపు ఐపీఎల్‌లో క్రికెటర్లను ఎలా కొనుగోలు చేస్తున్నారు.. మా హిందూ సోదరులను బంగ్లాదేశ్‌లో దహనం చేశారు. బంగ్లాదేశ్ క్రికెటర్ ను కొనుగోలు చేసినందుకు  షారుక్ ఖాన్ కు ఈ దేశంలో జీవించే హక్కు లేదు. ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చడానికి సహాయం చేశారు. ఎవరైనా షారుక్ నాలుకను కట్ చేస్తే వారికి రూ.లక్ష రూపాయల రివార్డు అందిస్తాం". అని మీరట్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మీరా రాథోడ్ అన్నారు.   

రెహ్మాన్ వంటి ఆటగాళ్లు భారత్ వస్తే విమానాశ్రయం నుంచి బయటకు అడుగు పెట్టలేడు అని బీజేపీ నేత హెచ్చరించారు. షారుఖ్ ఖాన్ పై విమర్శలు చేసిన వారిలో రాథోడ్ మొదటి వ్యక్తి కాదు. అంతకుముందు ఆధ్యాత్మిక గురువు దేవకినందన్ ఠాకూర్, బీజేపీ నాయకుడు సంగీత్ సోమ్ కూడా షారుక్ ను విమర్శిస్తూ రెహమాన్ ను జట్టు నుండి తొలగించాలని హెచ్చరించారు. ముస్తాఫిజుర్‌ను కొనుగోలు చేయడంపై బీజేపీతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. 

రూ.9.2 కోట్లకు కోల్‌కతా జట్టులో ముస్తాఫిజుర్: 

బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధర లభించిన సంగతి తెలిసిందే. ముస్తాఫిజుర్ ను రూ. 9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.2 కోట్లతో ఆక్షన్ లోకి వచ్చినా ముస్తాఫిజుర్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్లే ఆప్స్ ఆడాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ జాక్‌‌ ఫ్రేజర్‌‌ మెక్‌‌గర్క్‌‌ ప్లేస్‌‌లో బంగ్లాదేశ్‌‌ సీమర్‌‌ ముస్తాఫిజుర్‌‌ రెహమాన్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. 2016లో ఐపీఎల్‌‌ అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్‌‌ 2022, 2023లో డీసీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌‌ కెరీర్‌‌లో 38 మ్యాచ్‌‌లు ఆడిన ముస్తాఫిజుర్‌‌ 7.84 ఎకానమీతో 38 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్  106 టీ20ల్లో 132 వికెట్లు పడగొట్టాడు.