పటాన్చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు

పటాన్చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు
  • ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: పటాన్​చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ఆదివారం సాయంత్రం జీఎంఆర్​ఆల్​ఇండియా  బాడీ బిల్డింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలు జరుగనున్నాయి. పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. ప్రతీ ఒక్కరిలో వ్యాయామంపై  ఆసక్తి పెంపొందించేలా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

ట్రాక్​ సూట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

ఛత్తీస్​గఢ్​​రాష్ర్టంలోని దుర్గ్​ కేంద్రంగా జనవరి 6 నుంచి ప్రారంభమయ్యే స్కూల్​ గేమ్స్​ ఫేడరేషన్​ జాతీయ స్థాయి క్రీడల్లో  పాల్గొనేందుకు వెళ్తున్న  అండర్​‌‌14 తెలంగాణ కబడ్డీ జట్టుకు ఎమ్మెల్యే సొంత ఖర్చుతో ట్రాక్​ సూట్లను అందజేశారు. క్రీడాకారులకు శనివారం మైత్రి మైదానంలో అందజేశారు. మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ విజయ్​కుమార్, స్కూల్​ గేమ్స్​ ఫెడరేషన్​ జిల్లా కార్యదర్శి  శ్రీనివాస్, మైత్రి క్రికెట్​ క్లబ్​అధ్యక్షుడు హనుమంత్​, సీఐలు వినాయక్​రెడ్డి, రవీందర్​రెడ్డి పాల్గొన్నారు.