TS ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై జీవో జారీ

TS ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై జీవో జారీ

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో పరీక్షల రద్దుపై ఇవాళ(సోమవారం) జీవో జారీ చేశారు బోర్డు అధికారులు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే  ఫలితాలను ఏ ప్రాతిపదికన కేటాయించాలనే విషయంలో ఇంటర్ బోర్డుకు అధికారాలు మంజూరు చేశారు. దీనిపై కసరత్తులు చేసిన ఇంటర్ బోర్డు..రేపు(మంగళవారం) ఇంటర్ ఫలితాల విధివిధానాలను ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నారు.