కేసీఆర్ ఫేస్ మాస్కులతో టీచర్ల ఛలో అసెంబ్లీ

కేసీఆర్ ఫేస్ మాస్కులతో  టీచర్ల ఛలో అసెంబ్లీ

పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ  జీవో నెం.317 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బాధితుల సంఘం పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బిర్లా మందిర్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో భాగంగా ఉపాధ్యాయులు, సీఎం కేసీఆర్ ఫేస్ మాస్క్ ను ధరించి నిరసన తెలిపారు. జీవో నెం.317 వల్ల స్థానికతను కోల్పోయామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తోన్న టీచర్ల దగ్గర్నుంచి ఫేస్ మాస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.