కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు పలు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విషయంపై లేటెస్ట్ గా మరో నిర్ణయం తీసుకుంది. అవసరం అయితే తప్ప సింగపూర్ కు వెళ్లొద్దని సూచించింది. దీనికి సంబంధించి కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేవలం విజిటింగ్ కోసం మాత్రం సింగపూర్ కు వెళ్లవద్దని తెలిపింది.
దేశంలోకి కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు కట్మాండ్, ఇండోనేసియా, వియత్నాం, మలేసియా నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్టుల్లో సోమవారం నుంచి స్క్రీనింగ్ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం చైనా, హాంకాంగ్, థాయ్ లాండ్ , దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ నుంచి వచ్చే వారిని 21 ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు.