
హైదరాబాద్, వెలుగు: గోదావరి– కావేరి (జీసీ) లింక్పై మీటింగ్ను కేంద్రం వాయిదా వేసింది. ఈ నెల 24న హైదరాబాద్ జలసౌధలో ఆరో కన్సల్టేషన్ మీటింగ్ను నిర్వహించాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) నిర్ణయించింది. కానీ, ఆకస్మాత్తుగా ఆ మీటింగ్ను వాయిదా వేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. మళ్లీ మీటింగ్ను ఎప్పుడు పెడతామనేది వెల్లడించలేదు.
వాస్తవానికి గోదావరి కావేరి లింక్పై సంబంధిత రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్గఢ్, కర్నాటక, మహారాష్ట్రలతో సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. జీసీ లింక్పై అన్ని రాష్ట్రాలూ అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో.. ఏకాభిప్రాయం కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే 24న సమావేశం నిర్వహించాలనుకున్నది. అయితే, కన్సల్టేషన్ మీటింగ్ను వాయిదా వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.