భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు ఇరిగేషన్ శాఖకు రూ.46.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 400 మీటర్ల కొత్త కరకట్ట, 300 మీటర్ల పాత కరకట్ట రిపేర్లు, విగ్రహాల ఏర్పాటు, చిన్న ఆలయాల ఆధునీకరణ తదితర పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని 8 జిల్లాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రూ.241.14 కోట్లతో అభివృద్ధిపనులు చేపట్టనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీవో నంబర్ 359 జారీ చేశారు.
