భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్లాస్టిక్ సంచుల తయారీ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన బుధవారం భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగింది. అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెంలోని గోడౌన్ లో మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ సంచులు కావడంతో గోడౌన్ లో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి, పక్కనే ఉన్న ఇండ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో 15 ఇండ్లు దగ్ధమయ్యాయి.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వేగంగా ఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్త నష్టం జరిగినట్లు తెలిపారు ఫ్యాక్టరీ యజమానులు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.