స్వల్పంగా పెరిగిన బంగారం ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బంగారం వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పెరిగాయి. దేశీయ మార్కెట్ లో బంగారం ధర 170 రూపాయలు పెరిగి 32,790 రూపాయలకు చేరింది. దీంతో పాటే.. వెండి ధర కిలోకు 250 రూపాయలు పెరిగి 38,350లకు చేరింది.

హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.31,830 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.30,310 వద్ద ఉంది.

ఢిల్లీలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం 170రూపాయలు పెరిగి.. రూ.32,790కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 170రూపాయలు పెరిగి.. రూ.32,620కి చేరింది.

ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.32,000, 22 క్యారెట్ల బంగారం రూ.31,000.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు  రూ.33,020, 22 క్యారెట్ల బంగారం రూ.30,270.