జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-33లో నివాసముంటున్న శోభారాణి (60), కృష్ణ ప్రసాద్ దంపతుల ఇంట్లో దొంగతనం జరిగింది. శోభారాణి మంగళవారం తన ఇంట్లోని కబోర్డ్ను తనిఖీ చేయగా, అందులో భద్రపరిచిన రెండు బంగారు గాజులు, రెండు బంగారు చైన్లు, రూ.10 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్తో తనిఖీలు చేపట్టారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
