
న్యూఢిల్లీ: భారత్–పాక్మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ బంగారం కొనుగోళ్లు, ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధానిలో బుధవారం బంగారం ధర రూ.వెయ్యి పెరిగి రూ. లక్ష మార్కును దాటింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర మంగళవారం 10 గ్రాములకు రూ.99,750 వద్ద ముగిసింది.
బుధవారం ఇది రూ.1,00,750కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం 10 గ్రాములకు రూ.1,050 పెరిగి రూ.1,00,350కి చేరుకుంది. ఇది మంగళవారం 10 గ్రాములకు రూ.99,300 వద్ద ముగిసింది. పుత్తడి ధర గత నెల 22న జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,01,600ను తాకింది. అప్పుడు అది రూ.1,800 పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.440 పెరిగి రూ.98,940కి చేరుకుంది.