శనివారం సడెన్ షాక్ ఇచ్చిన బంగారం.. గ్రాముకు ఎంత పెరిగిందంటే..?

శనివారం సడెన్ షాక్ ఇచ్చిన బంగారం.. గ్రాముకు ఎంత పెరిగిందంటే..?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా టెన్షన్స్ వల్ల నిన్నటి వరకూ తగ్గిన బంగారం రేట్లు అనూహ్యంగా శనివారం యూటర్న్ తీసుకున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని మారిన ధరలను గమనించటం చాలా ముఖ్యం.

జూలై 18న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 17 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.76 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 329గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 135గా కొనసాగుతోంది. 

శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 18, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 35వేలుగా అమ్మబడుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.