Gold Rate: సామాన్యుల ఊహకందని స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాదులో తులం ధర..

Gold Rate: సామాన్యుల ఊహకందని స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాదులో తులం ధర..

Gold Price Today: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దిగజారిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు పసిడికి డిమాండ్ రోజురోజుకూ పెంచేస్తున్నాయి. ఇక్కడ రిటైల్ వినియోగం కంటే కూడా సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్ట్ చేసేవారి నుంచే ఎక్కువగా డిమాండ్ కనిపిస్తోంది. పాక్ పై భారత్ క్షిపణి దాడుల తర్వాతి నుంచి బ్రేక్ లేకుండా పసిడి ధరలు పరిగెడుతూనే ఉన్నాయి. అయితే రిటైల్ షాపింగ్ చేసేవారి నేటి తాజా రేట్లను గమనించటం ముఖ్యం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 130, ముంబైలో రూ.9వేల 130, దిల్లీలో రూ.9వేల 145, కలకత్తాలో రూ.9వేల 130, బెంగళూరులో రూ.9వేల 130, కేరళలో రూ.9వేల 130, వడోదరలో రూ.9వేల 135, అహ్మదాబాదులో రూ.9వేల 135, జైపూరులో రూ.9వేల 145, లక్నోలో రూ.9వేల 145, మంగళూరులో రూ.9వేల 130, అయోధ్యలో రూ.9వేల 145, నోయిడాలో రూ.9వేల 145, గురుగ్రాములో రూ.9వేల 145 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6వేల పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 960, ముంబైలో రూ.9వేల 960, దిల్లీలో రూ.9వేల 975, కలకత్తాలో రూ.9వేల 960, బెంగళూరులో రూ.9వేల 960, కేరళలో రూ.9వేల 960, వడోదరలో రూ.9వేల 965, అహ్మదాబాదులో రూ.9వేల 965, జైపూరులో రూ.9వేల 975, లక్నోలో రూ.9వేల 975, మంగళూరులో రూ.9వేల 960, అయోధ్యలో రూ.9వేల 975, నోయిడాలో రూ.9వేల 975, గురుగ్రాములో రూ.9వేల 975గా ఉన్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9వేల 130 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల960గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 11వేల 100 వద్ద నేడు కొనసాగుతున్నాయి.