
మురళీమోహన్, జయసుధ జంటగా గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లక్ష్మణ రేఖ’. ఈ చిత్రం విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహించారు. చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధలతోపాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్గా పని చేసిన రాజేంద్రప్రసాద్లను ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వీరంతా 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావాలను లక్ష్మణరేఖలుగా మలచుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు ధవళ సత్యం, నిర్మాతలు ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు.