కార్తిక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా సతీష్ వర్మ దర్శకత్వంలో హీరో రవితేజ నిర్మించిన చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. ఈనెల 15న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ గోల్డీ నిస్సీ మాట్లాడుతూ ‘నేను తెలుగమ్మాయిని. కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించా. ఆడిషన్స్ ద్వారా ఇందులో సెలక్ట్ అయ్యా. ఇదే నా ఫస్ట్ బిగ్ మూవీ. హాయిగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుంది. ఇందులో మంగరత్నం అనే కానిస్టేబుల్గా నటించా. కొంచెం గ్రే షేడ్ ఉండే పాత్ర. ఆమెను మెకానిక్ అయిన బంగార్రాజు ఇష్టపడతాడు.
ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ సరదాగా, ఇంటరెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి చివరి వరకూ ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. మొదటి సినిమానే రవితేజ గారి నిర్మాణంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పూర్తయ్యాక రవితేజ గారిని కలిసినప్పుడు.. కొత్త అయినా భయం లేకుండా నటించావ్ అని మెచ్చుకోవడం మర్చిపోలేను. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలాగే మెచ్చుకుంటారని ఆశిస్తున్నా’ అని చెప్పింది.