- రాండ్ స్టాడ్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ:భారతదేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్గా టెక్నాలజీ కంపెనీ గూగుల్ అవతరించింది. టాటా గ్రూప్ రెండో స్థానంలో, అమెజాన్ మూడో స్థానంలో నిలిచాయి. రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2026 రిపోర్ట్ ప్రకారం..శామ్సంగ్ , ఇన్ఫోసిస్, రిలయన్స్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఐటీసీ , హెచ్యూఎల్, మహీంద్రా , డెల్ టెక్నాలజీస్ కూడా టాప్–-10లో చోటు దక్కించుకున్నాయి. రాబోయే ఆర్నెళ్లలో 46 శాతం మంది భారతీయ నిపుణులు ఉద్యోగాలు మారాలని భావిస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, సమాన అవకాశాలు, కెరీర్ పురోగతి, జీతం, ప్రయోజనాలు ఉద్యోగులను ఆకర్షించే ముఖ్యమైన అంశాలుగా మారాయి. డిజిటల్ టాలెంట్ నిపుణులు పోటీ జీతాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిలో గుర్తింపు, కెరీర్ కొనసాగింపు భద్రతకు బలమైన పునాదులుగా ఉంటాయని రాండ్స్టాండ్ సర్వే స్పష్టం చేసింది.
