ఇటలీలో గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ స్టార్ట్

ఇటలీలో గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ స్టార్ట్

గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఇటీవల కొత్త చిత్రం ప్రారంభమైంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటలీలోని మాంటెరాలో ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెడుతున్నారు. ఆదివారం శ్రీనువైట్ల బర్త్‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా అక్కడి లొకేషన్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.  అద్భుతమైన లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రాన్ని షూట్ చేయనున్నట్టు వీడియో ద్వారా తెలియజేశారు.  

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని రూపొందిస్తున్నట్టు శ్రీనువైట్ల చెప్పాడు. చాలా భాగం ఫారిన్‌‌‌‌‌‌‌‌లోనే షూట్ జరగనుంది.  గోపీచంద్ నటిస్తున్న 32వ సినిమా ఇది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  శ్రీనువైట్ల పలు బ్లాక్‌‌‌‌‌‌‌‌బస్టర్స్‌‌‌‌‌‌‌‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ దీనికి స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లే రాస్తున్నారు.  కెవి గుహన్ కెమెరామెన్‌‌‌‌‌‌‌‌గా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘విశ్వమ్’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.