
బాలీవుడ్ స్టార్స్ ఇటీవల సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘గదర్ 2’తో గతేడాది స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన యాక్షన్ హీరో సన్నీడియోల్ కూడా తెలుగు దర్శకుడితో కలిసి వర్క్ చేయబోతున్నాడు. క్రాక్, వీరసింహా రెడ్డి లాంటి సక్సెస్ఫుల్ మూవీస్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్న చిత్రమిది. మాస్ ఫీస్ట్ లోడింగ్ అనేది దీనికి క్యాప్షన్. మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు కలిసి ఈ హిందీ చిత్రాన్ని నిర్మిస్తునాయి. గురువారం హైదరాబాద్లో ఈ సినిమాను ప్రారంభించారు.
సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ డీవోపీ. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అనల్ అరసు, వెంకట్ మాస్టర్స్ ఫైట్ కొరియోగ్రాఫర్స్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్తో మ్యాసీవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించనున్నామని, మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో సన్నీడియోల్ను ప్రెజెంట్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. వై రవి శంకర్, నవీన్ యెర్నేని, టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.