ఫేస్ టు ఫేస్ కిషన్ రెడ్డిని ఎందుకు అడగలే.?: రాజాసింగ్

ఫేస్ టు ఫేస్ కిషన్ రెడ్డిని ఎందుకు అడగలే.?: రాజాసింగ్
  •  చెవులు ఉన్నోళ్లను అడిగితే లాభం
  • వెళ్లి ప్రధాని మోదీని అడగండి
  • కిషన్ రెడ్డిపై రాజాసింగ్  పరోక్ష విమర్శలు 


హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవాళ సీఎం ఢిల్లీలో చేసిన చిట్ చాట్ ను ఉదహరిస్తూ.. ‘మొన్న దత్తాత్రేయ బుక్  ఆవిష్కరణ ఫంక్షన్ కు కిషన్ రెడ్డి వచ్చారు..  మీరూ వెళ్లారు కదా..? అప్పుడే ఫేస్ టు ఫేస్ ఎందుకు అడగలేదు..’అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘మీరు ఢిల్లీలోనే ఉన్నారు కదా..? వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవండి మీ పని అయిపోతుంది’ అంటూ రాసుకొచ్చారు. 

2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో కూడా లిస్ట్ తెచ్చుకోండి..అని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులెన్ని అన్న అంశంపై తాము అసెంబ్లీ వేదికగా ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం రావడం లేదన్నారు.   గతంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు నిధులు రాలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం మాట్లాడారని అన్నారు.  కనీసం మీరన్న నిజం చెప్తారని ఒక నమ్ముతున్నట్టు తెలిపారు. చెవులు లేని వాళ్ళని అడిగితే లాభం ఏం ఉండదని, చెవులు ఉన్నోళ్లను అడిగితే ప్రయోజనమని అన్నారు.