సమన్వయంతో పని చేయాలి.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

సమన్వయంతో పని చేయాలి..  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సూచించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచులు, కౌన్సిలర్లకు  ట్రైనింగ్​ నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​గా హాజరైన షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే ఉద్ధేశంతో ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణ చేపట్టిందన్నారు.

మౌలిక వసతుల కల్పన, పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యచరణను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఎస్పీ రాజేశ్​చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, అధికారులు  పాల్గొన్నారు. వివిధ ఆంశాలపై పవర్​ పాయింట్​ప్రజంటేషన్​ ఇచ్చారు.