ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీకి స‌ర్కార్ ఆమోదం

ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీకి స‌ర్కార్ ఆమోదం

మార్చి 1 నుంచి 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు
                                              
హైద‌రాబాద్‌ : రాష్ట్రంలో ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. భార్యాభ‌ర్త‌ల‌ను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వ‌చ్చిన విన‌తులు, అప్పీళ్ల ప‌రిష్కారం పూర్తికావ‌డంతో ప‌ర‌స్ప‌ర బ‌దిలీలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల కోసం వ‌చ్చేనెల 1వ తేదీ నుంచి 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది...రేవంత్ రెడ్డి