- రూ. 5లక్షలకు మహిళా సంఘం భవనం అమ్మకం
- సర్పంచ్తండ్రి, ఉప సర్పంచ్భర్త , మహిళా సంఘం లీడర్లు కలిసి స్కెచ్
- ఆఫీసర్లకు తెలిసీ పట్టించుకో లేదంటున్న స్థానికులు
మక్తల్, వెలుగు; గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు ఒక్కటై గవర్నమెంట్ బిల్డింగ్నే వేలం వేసి అమ్మేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం ఎర్గాట్పల్లిలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్గాట్పల్లి గ్రామంలో 20 ఏండ్ల కింద మహిళ సమాఖ్య భవనాన్ని నిర్మించారు.మహిళ సమతా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఊట్కూరు మండలంలో మహిళలను ఆర్ధికంగా బలపడేలా చేయాలని పొదుపు సంఘాలను ప్రారంభించింది.ఏర్గాట్పల్లిలో 34 మంది మెంబర్స్ కలిసి పార్వతి మహిళ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం కోసం 200 గజాల స్థలంలో 2002లో బిల్డింగ్ను నిర్మించారు. దీంతోపాటు కొల్లూరు, ఊట్కూర్ , పెద్దపొర్ల, తిప్రాస్పల్లి, పులిమామిడి గ్రామాల్లో మహిళ సమాఖ్య భవనాలను నిర్మించింది. ఒక్కో బిల్డింగ్ కోసం ప్రభుత్వం అప్పట్లో రూ. 40 వేలు కేటాయించింది. 5ఏండ్ల కింద మహిళ సమత సోసైటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ బిల్డింగ్లో ఐకేపీ సిబ్బంది సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. గ్రామ సర్పంచ్ తండ్రి, ఉప సర్పంచ్భర్త, గ్రామ పెద్దలు కలిసి మహిళా సంఘ సభ్యులతో మాట్లాడారు. ఈ భవనం మహిళ సంఘానికి సొంతమని.. దీన్ని అమ్మి డబ్బులను పంచుకుందామని ఒప్పించారు. వారం రోజుల క్రితం సంఘం సభ్యులు, సర్పంచ్ తండ్రి బాలకిష్టయ్య, ఉప సర్పంచ్భర్త కలిసి ఊళ్లో బిల్డింగ్ను వేలం వేశారు. శంకరమ్మ అనే మహిళాసంఘం మెంబర్ రూ 5 లక్షలకు బిల్డింగ్ను కొనుక్కుంది. వచ్చిన డబ్బులను వీరు గుట్టుచప్పుడు కాకుండా మెంబర్స్కు పంచారు. ఈ సంగతి ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బిల్డింగ్ను అమ్మడం సరైంది కాదని, ఈ విషయాన్ని జిల్లా ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తానని ఐకేపీ ఏపీఎం నర్సిములు చెప్పారు.