
ముదిగొండ, వెలుగు : మతికేపల్లి మార్కెట్ యార్డును ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, నేలకొండపల్లి మార్కేట్ యార్డుల విభజన ద్వారా ముదిగొండ, చింతకాని మండలాలతో మతికేపల్లి మార్కెట్ యార్డును ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు సదుపాయం లేనందువలన, మొక్కజొన్న, పత్తి ఇతర పంటలను రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకునేవారని, కానీ ఇప్పుడు మతికేపల్లి మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.