అగ్రి చట్టాలపై పోరాటం ఆపకండి.. రైతులకు ప్రియాంక విజ్ఞప్తి

అగ్రి చట్టాలపై పోరాటం ఆపకండి.. రైతులకు ప్రియాంక విజ్ఞప్తి

ముజఫర్‌నగర్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతులు ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కోరారు. అన్నదాతలు ధైర్యంగా ఉండాలని, ఈ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందన్నారు. ‘ఈ ప్రభుత్వం చాలా బలహీనమైంది. కొత్త అగ్రి చట్టాల విషయంలో కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గక తప్పదు’ అని ప్రియాంక చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని ముజఫర్ నగర్‌‌లో కాంగ్రెస్ నిర్వహించిన మహాపంచాయత్‌‌‌‌లో పాల్గొన్న ప్రియాంక పైవ్యాఖ్యలు చేశారు.