గవర్నర్​నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్​ఎస్​ నేతలు

గవర్నర్​నిర్ణయంపై హైకోర్టుకు  బీఆర్​ఎస్​ నేతలు

 

  • నామినేటెడ్​ఎమ్మెల్సీలపై ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్ఎస్​లీడర్లు

  • పిటిషన్ పై​ఎల్లుండి విచారణ

హైదరాబాద్‌: నామినేటెడ్​ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్​లీడర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం(జనవరి 5) విచారణకు రానుంది. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ గత జూలైలో  బీఆర్ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం(జనవరి 5) సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది.