- అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం
- .ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ఆలస్యమైతది
- నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నరు
- గవర్నర్ తమిళిసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్తమిళిసైకి లేఖ రాసిన ఆయన.. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా చేసి నెల రోజులవుతున్నదని, వాటిని గవర్నర్ఎంత త్వరగా ఆమోదిస్తే అంత త్వరగా కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని అన్నారు. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల తమ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నదని చెప్పారు.
నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని, త్వరలోనే ఎన్నికల కోడ్కూడా వచ్చే అవకాశం ఉందని, కోడ్ వస్తే నియామకాలు మరింత లేట్అయ్యే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని తొలగించలేదని, వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి.. రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం ఉండబోదని ఆయన వెల్లడించారు. నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలను గత ప్రభుత్వంలోని టీఎస్పీఎస్సీ అంగట్లో అమ్మకానికి పెట్టిందని జీవన్రెడ్డి విమర్శించారు. నైతికంగా వారు రాజీనామా చేయాలని, కానీ, అప్పుడు అలా జరగలేదని గుర్తు చేశారు.
చర్యలు తీసుకోవాల్సిన గత ప్రభుత్వం వారికి వంత పాడిందన్నారు. గత బోర్డు ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.