తెలంగాణతో నాకు ప్రత్యేక అనుబంధం 

తెలంగాణతో నాకు ప్రత్యేక అనుబంధం 

యూనివర్సిటీలలో  ఉన్న పరిస్థితులపై   తనకు వచ్చిన  రిపోర్ట్ ను ప్రభుత్వానికి  పంపానన్నారు  గవర్నర్ తమిళిసై.  రాష్ట్రానికి  ,కేంద్రానికి వారధిగా  తాను  పని  చేస్తానన్నారు. తెలంగాణకు …తనకు …ప్రత్యేక అనుబంధం  ఉందని…తాను  కూడా  జూన్ 2 రోజు  పుట్టానన్నారు గవర్నర్.  తమిళనాడు తల్లినైనా..తెలంగాణకు సిస్టర్ నన్నారు. హైదరాబాద్  వరదల సమయంలో  తమిళనాడు  సీఎంను  కోరగానే  పదికోట్ల విరాళం  ఇచ్చారని తెలిపారు.  వివాదస్పద  సలహాలు, సూచనలు  తాను ఎప్పుడు  ఇవ్వనని తెలిపారు.  కరోనా,  లాక్ డౌన్ తో  గిరిజన ప్రాంతాలకు వెళ్లలేదని…ఈనెల  చివర్లో  గిరిజన ప్రాంతాలో  పర్యటిస్తానన్నారు. తాను మంచి కమ్యూనికేటర్ నన్నారు. మంచిగా కమ్యూనికేట్ చేస్తే వివాదాలు ఉండవన్నారు.  ప్రభుత్వానికి  తన సర్విసెస్ ను ఉపయోగించుకోవాలన్నారు . తన తండ్రి మంచి గాంధేయ వాదని..తాను బీజేపీ వాదినన్నారు.  రాజ్ భవన్ లో  మూవింగ్  ఫార్వర్డ్ విత్  మెమోరీస్ ఆఫ్  మైడెన్ ఇయర్ పుస్తకాన్ని  గవర్నర్ విడుదల చేశారు.

see more news

ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా?

వీడియో: బర్త్ డే పార్టీకి రానన్నాడని.. కారుతో గుద్ది చంపాడు