బిల్లులు పెండింగ్లో లేవు..కేటీఆర్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చిన గవర్నర్
హైదరాబాద్, వెలుగు : రాజ్ భవన్లో ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేవని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. 3 బిల్లులు ఆమోదించానని, రెండు బిల్లు లు రాష్ట్రపతి పరిశీలనకు పంపానని, మిగతా బిల్లులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి తిప్పి పంపినట్లు సోమ వారం రాజ్ భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఇటీవల ప్రధాన మోదీ వరంగల్ పర్యటన తర్వాత కేటీఆర్ బిల్లులపై మాట్లాడారు. ఉద్యో గాలు భర్తీ చేయడం లేదంటున్న ప్రధాని... వేదికపై ఉన్న గవర్నర్కు వర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు ఆమోదించాలని చెప్పొచ్చు కదా అని కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ క్లారిటీ ఇచ్చారు.