నాణ్యమైన విద్యను అందిస్తా లేదంటే రాజీనామా చేస్తా

నాణ్యమైన విద్యను అందిస్తా లేదంటే రాజీనామా చేస్తా

ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన బస్సులను తమ గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారు ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు స్వరూప, గ్రామస్తులు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామంలో గ్రామ విద్యా కమిటీ చైర్మన్ బాణోత్ మంగ్యా ఆధ్వర్యంలో ఈ రోజు బడిబాట కార్యక్రమం జరిగింది. బడిబాట నిర్వహిస్తుండగా.. ఓ ప్రైవేట్ స్కూల్ కు సంబంధించిన బస్సులు గ్రామంలోకి  రావడంతో ఉపాధ్యాయురాలు స్వరూప అడ్డుకున్నారు.

గ్రామంలోని పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తానని, లేనిపక్షంలో  ఉద్యోగానికి రాజీనామా చేస్తానని స్వరూప పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అవసరమైతే గ్రామస్తులకు బాండ్ పేపర్ కూడా రాసిస్తానని ఆమె మాటిచ్చారు. దీంతో గ్రామస్తులు అందరూ కూడా రేపటి నుండి తమ పిల్లలను తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామని తెలిపారు.