త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్!

త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షెడ్యూల్!
  • రేపు జరిగే మీటింగ్‌లో ఎన్నికలపై నిర్ణయం
  • ఎలక్షన్ కోడ్ వస్తదనే సాగర్‌లో సీఎం వరాలు

హైదరాబాద్, వెలుగు: సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్​ త్వరలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల చేయనుంది. వచ్చే నెల 29న గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రారావు.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ ​పల్లా రాజేశ్వర్​రెడ్డిల టర్మ్ ముగియనుంది. ఇప్పటికే ఈ స్థానాలకు గ్రాడ్యుయేట్​ఓటర్ల లిస్ట్​ను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. సీఈసీ ప్రతి శుక్రవారం ఆర్ఓలతో రివ్యూ నిర్వహిస్తుంది. దీంతో రేపు జరిగే మీటింగ్​లో ఈ రెండు స్థానాలకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్..  హాలియాలో ధన్యవాద సభ పెట్టి, ముందస్తుగా వరాల జల్లు కురిపించారని ప్రచారం జరుగుతోంది. వారం రోజుల్లో షెడ్యూల్​ వచ్చే అవకాశం ఉండడంతో, ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వస్తుందని సీఎం కొత్త కానుకలు ప్రకటించినట్లు సమాచారం. ఆ గ్రాడ్యుయేట్​ నియోజకవర్గంలో పల్లా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

For More News..

కేసీఆర్ కుటుంబీకులు రూ. 25 లక్షల జీతం తీసుకుంటున్నరు

కేసీఆర్ పాలనపై హైదరాబాద్‌‌‌‌లో మాట్లాడుతా

కొత్త ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు