పెన్షన్ డబ్బులకోసం నానమ్మనే చంపిన మనవడు

పెన్షన్ డబ్బులకోసం నానమ్మనే చంపిన మనవడు

కేశంపేట, వెలుగు: పెన్షన్ డబ్బుల కోసం నానమ్మను కొట్టి చంపాడో మనవడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధి కాకునూరు గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(90)ను మనవడైన కుమ్మరి శేఖర్
(27) గురువారం రాత్రి పింఛన్ డబ్బులు ఇవ్వా లంటూ కట్టెతో బలంగా కొట్టాడు.తలను నేలకేసి బాదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. శేఖర్ తమ నానమ్మనుకొడుతుండగా తాను, శేఖర్ తండ్రి సాయిలువిడిపించినట్లు పెద్దనాన్న కుమారుడు కుమ్మరి యాదగిరి తెలిపారు. శేఖర్ కొట్టిన దెబ్బల వల్లే నానమ్మ చనిపోయిందని పోలీసులకు ఫిర్యా దు చేశారు.