హైదరాబాద్, వెలుగు : పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ జరిగాయని తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల క్రితం పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయ్యాయి. దాంతో కల్యాణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక ఫైళ్లను తీసుకెళ్లారని.. మిగతా ఫైళ్లను చిందరవందరగా పడేశారని వివరించారు.
ఆఫీస్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్మెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్యాణ్తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు.