మరీ ఇంత మంచోడివి ఏంటన్నా: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త

మరీ ఇంత మంచోడివి ఏంటన్నా: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త

భార్య పరాయి మగాడి వంక చూసినా, మాట్లాడినా నానా రచ్చ చేసే సమాజం మనది. అదే ఇంకో అడుగు ముందుకేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నదని తెలిస్తే.. హత్యలకు కూడా వెనుకాడరు. అలాంటి ఈరోజుల్లో ఓ గొప్ప మానవతా వాది వెలుగులోకి వచ్చారు. భార్యకు ప్రియుడంటే ఇష్టమని అతనితోనే వివాహం జరిపించారు. ఈ ఘటన బిహార్‌లోని నవాడ జిల్లాలో చోటుచేసుకుంది. 

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. నవాడ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత అదే ప్రాంతానికి చెందిన ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వ్యవహారం కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. ఓ రోజు రాత్రి ఆమె భర్త పని మీద బయటకు వెళ్లగా.. ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లింది. అయితే ఆమె ప్రియుడి ఇంట్లోకి వెళ్లడాన్ని స్థానికులు, అతని తరుపు బంధువులు గమనించారు. కాసేపటి తరువాత అందరూ కలిసి వారున్న ఇంటిని చుట్టుముట్టడంతో పట్టుబడిపోయారు. 

అనంతరం వారిద్దరిని తీవ్రంగా కొట్టారు. ఆపై ఇరువురి గ్రామ పెద్దలు కలిసి పంచాయతీ చేశారు. వారిద్దరినీ ఊరి నుంచి వెలివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతలోనే వివాహిత భర్తకు ఈ విషయం తెలియడంతో.. పరుగున అక్కడకి చేరుకున్నాడు. పంచాయితీ పెద్దల్లా, స్థానికుల్లా ఎలాంటి ఆవేశకావేశాలకు లోనుకాకుండా.. అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరిని వెంటబెట్టకెళ్లి గుడిలో పెళ్లి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్తున్నారు.