సినిమా థియేటర్లలో 100% సీటింగ్కు గ్రీన్ సిగ్నల్

సినిమా థియేటర్లలో 100% సీటింగ్కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగానికి ఊరట కలిగించేలా మరో నిర్ణయం తీసుకుంది. రేపటి (శుక్రవారం) నుంచి రాష్ట్రంలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని థియేటర్లకు అనుమతినిచ్చింది. అయితే... కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రేక్షకులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

టాలీవుడ్ నుంచి ఈ వేసవిలో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న టైంలో ప్రభుత్వం ఈ నిర్ణయంతో థియేటర్ యజమానులకు మేలు కలగనుంది.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి