
- భూ సేకరణ చేస్తోన్న అధికారులు
కొడంగల్, వెలుగు: వలసలకు కేరాఫ్గా ఉన్న కొడంగల్ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రానుంది. గ్రీన్ఫీల్డ్క్లస్టర్లో భాగంగా దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు దాదాపు 1200 ఎకరాల భూమి సేకరించేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు.
ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి భూములను పరిశీలిస్తున్నారు. గ్రామ పెద్దలు, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ఫార్మా విలేజ్ఏర్పాటు చేస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. సరైన ఉపాధి అవకాశాలు లేక ఇక్కడి ప్రజలు హైదరాబాద్, ముంబై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు.