ఖమ్మంలో ఐటీ హబ్-2కు గ్రీన్ సిగ్నల్

ఖమ్మంలో ఐటీ హబ్-2కు గ్రీన్ సిగ్నల్
  • ఐటీ హబ్-2కు పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం

 

  • రూ.36 కోట్లతో 55 వేల చదరపుటడుగుల్లో నిర్మాణం


ఖమ్మం జిల్లాకు రెండో దశ ఐటీ హబ్ నిర్మాణ పనులకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరపనున్నారు. ఈ ఐటీ హబ్ వల్ల ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునే వేసులుబాటుతో విశాలమైన సముదాయం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద గల ప్రస్తుత ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించి తమ సేవలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. నేడు ఐటీ టవర్-2కు పరిపాలన అనుమతులు మంజూరు కావడం విశేషం. అతి త్వరలో టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.